మనవార్తలు ,పటాన్ చెరు:
భారతీయ జీవిత భీమా పరిశ్రమలో లాభదాయకతను పెంపొందించే ఒక అధ్యయనం ‘ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి రమేష్ కుమార్ సాతులూరిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ – హైదరాబాద్ ప్రొఫెసర్ ఆర్.రాధిక సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .
భారతదేశంలో జీవిత భీమా సంస్థల లాభదాయకతపై ధృవీకరించే సాక్ష్యాలను అందించడం ఈ పరిశోధన ప్రధాన లక్ష్యంగా ఆమె తెలిపారు . డిపెండెంట్ వేరియబుల్ , మొత్తం వ్యయం , కొత్త వ్యాపార ప్రీమియం , పునరుద్ధరణ ప్రీమియం , ఇండిపెండెంట్ వేరియబుల్స్ గా చెల్లించే ప్రయోజనాల మధ్య లాభదాయకత మధ్య సహసంబంధాన్ని ఏర్పరచడానికి ఈ థీసిస్ ప్రయత్నించినట్టు ఆమె పేర్కొన్నారు .
విశ్లేషణ ప్రకారం , నిబంధనలు , నిలకడ లాభదాయకతపై సానుకూల ప్రభావాన్ని చూపినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు . రమేష్ కుమార్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , గీతం బిజినెస్ స్కూల్ – హైదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…