Telangana

ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలి: నీలం మధు ముదిరాజ్

దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ

ఇస్నాపూర్ లో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం

హాజరైన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దేవాలయాల నిర్మాణంతో గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాధవానంద సరస్వతి హాజరై భక్తులకు ఆశీర్వాదం అందించారు.ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి నుంచి బయట పడటానికి ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలన్నారు. దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఆలయాల నిర్మాణానికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్,ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి, మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు మన్నె రాఘవేందర్, ఊళ్ళ శంకర్, పెంటయ్య, యాదగిరి, రవి, రాజు, మణికంఠ, పాండు, వి నారాయణరెడ్డి, అశోక్, పాండు, సుధాకర్, ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago