దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ
ఇస్నాపూర్ లో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం
హాజరైన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దేవాలయాల నిర్మాణంతో గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాధవానంద సరస్వతి హాజరై భక్తులకు ఆశీర్వాదం అందించారు.ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి నుంచి బయట పడటానికి ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలన్నారు. దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఆలయాల నిర్మాణానికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్,ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి, మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు మన్నె రాఘవేందర్, ఊళ్ళ శంకర్, పెంటయ్య, యాదగిరి, రవి, రాజు, మణికంఠ, పాండు, వి నారాయణరెడ్డి, అశోక్, పాండు, సుధాకర్, ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…