ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు
తాజా మాజీ మున్సిపల్ పాలకవర్గాలకు ఘన సన్మానం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రజాస్వామ్యంలో పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని.. సమయం వచ్చినప్పుడు ప్రజలే తిరిగి అవకాశం ఇస్తారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో.. ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ పాలకవర్గాలను ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల కాలంలో నూతనంగా ఏర్పడిన అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుని అభివృద్ధికి ప్రత్యేకగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రతి పాలకవర్గ సభ్యుడు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందున్నారని అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే పంథాలో కొనసాగాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల పరిధిలో దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగేష్,మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, తొంట అంజయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్లు లలిత సోమిరెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు దేవానందం, రవీందర్ రెడ్డి, యాదగిరి యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సోమిరెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్,.పాండు, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…