ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని,గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి లు అన్నారు.
పటన్ చెరు మండల పరిధిలోని బచ్చు గూడెం,ఇంద్రేశం, రామేశ్వరంబండ గ్రామాల సర్పంచులతో మొక్కలు నాటారు.గ్రామాలలో నిర్వహించిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీపీ లు విచ్చేసి గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ కలిసి మెలిసి ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.
రానున్న వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. లేని ఎడల అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా హరితహారం లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మనం అందరం ఇప్పుడు మొక్కలు నాటితే భావితరాలకు మంచి వాతావరణం అందించిన వాళ్ళము అవుతామని పేర్కొన్నారు. చెట్లు పెరిగితే వర్షాలు కూడా బాగా పడతాయని చెప్పారు. లక్డారం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ఆయా గ్రామ సర్పంచ్ లను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు అంతిరెడ్డిగారి ధరణి అంతిరెడ్డి,దండు నర్సింహా,ఒగ్గు సుమతి రాంచందర్, ఉప సర్పంచులు శివ కుమార్ గౌడ్,జంగారెడ్డి, నాగేశ్,ఎంపీడీఓ బన్సీలాల్, స్పెషల్ ఆఫీసర్ సతీష్, రామేశ్వరంబండ ఎంపీటీసీ మాణెమ్మ,ఈఓలు భవానీ, సుభాష్,వార్డు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…