politics

ప్రతి ఒక్కరూ విధిగా మెక్కలను నాటాలి….

పటాన్ చెరు:

ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని,గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి లు అన్నారు.

పటన్ చెరు  మండల పరిధిలోని బచ్చు గూడెం,ఇంద్రేశం, రామేశ్వరంబండ గ్రామాల సర్పంచులతో మొక్కలు నాటారు.గ్రామాలలో నిర్వహించిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీపీ లు విచ్చేసి గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ కలిసి మెలిసి ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.

 

రానున్న వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. లేని ఎడల అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా హరితహారం లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మనం అందరం ఇప్పుడు మొక్కలు నాటితే భావితరాలకు మంచి వాతావరణం అందించిన వాళ్ళము అవుతామని పేర్కొన్నారు. చెట్లు పెరిగితే వర్షాలు కూడా బాగా పడతాయని చెప్పారు. లక్డారం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ఆయా గ్రామ సర్పంచ్ లను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు అంతిరెడ్డిగారి ధరణి అంతిరెడ్డి,దండు నర్సింహా,ఒగ్గు సుమతి రాంచందర్, ఉప సర్పంచులు శివ కుమార్ గౌడ్,జంగారెడ్డి, నాగేశ్,ఎంపీడీఓ బన్సీలాల్, స్పెషల్ ఆఫీసర్ సతీష్, రామేశ్వరంబండ ఎంపీటీసీ మాణెమ్మ,ఈఓలు భవానీ, సుభాష్,వార్డు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago