politics

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి
– నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ
– డంపు యార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్

పటాన్ చెరు:

పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని డంపు యార్డులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం మేయర్ కూకట్ పల్లి నుండి పటాన్ చెరు పట్టణానికి సందర్శించి, పనులను పరిశీలించారు. చెత్త సేకరణ, విసర్జన, పారిశుధ్య కార్మికుల పనితీరు తదితర అంశాలను స్థానిక ఉప కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ నగరాన్ని గ్రీన్ హైదరాబాద్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని అన్నారు. ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పట్టణంలో పరిశుభ్రత పరవాలేదని, మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పట్టణ ప్రజలందరూ చెత్తను జీహెచ్ఎంసీ ఆటోలోనే వేయాలని తెలిపారు. చెత్తను తీసుకువెళ్లేందుకు ఆటో వారికి మీకు తోచిన విధంగా డబ్బులు ఇవ్వాలని సూచించారు.

అనంతరం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ డివిజన్ పరిధిలోని సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. పారిశుధ్య కర్మికుల సిబ్బంది కొరతను వివరించారు. ఇంతకు ముందు బండ్లగూడ గ్రామం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా 2 సంవత్సరాల క్రితం పటాన్ చెరు డివిజన్ లో విలీనం చేయడం జరిగింది. కావున తగినంత సిబ్బందిని నియమించాలని కోరారు. నూతనంగా కలిసిన బండ్లగూడ గ్రామంతో చెత్త సేకరణకు తగినన్ని వాహనాలు లేవని కాబట్టి పారిశుధ్య పనులు సజావుగా సాగేందుకు 30 స్వచ్చ ఆటోలను, 20 స్వచ్చ రిక్షాలను, 30 చెత్త తోపుడు బండ్లు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

బండ్లగూడ గ్రామానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని అన్నారు. బండ్లగూడ గ్రామం డివిజన్ లో విలలీనమయినప్పటికి అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పాత వేతనం రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారని, కావున పటాన్ చెరు లోని పారిశుధ్య కార్మికులతో పాటు సమానవేతనం రూ.17 వేలు మంజూరు చేయగలరని వినతి పత్రం అందజేశారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలో దేశం లోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారని అందులో కార్మికులే ఎక్కువగా ఉన్నందున వారు తమ పనులకు వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటి బస్ స్టాండ్ కు వెళ్ళవలసి వస్తుంది.

ఇలా రోడ్డు దాటే క్రమంలో చాలామంది ప్రమాదాలకు గురైయ్యారని, ప్రాణాలు కూడా కోల్పోయారు. కావున బస్ స్టాండ్ పరిధిలో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నియమిస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారవుతారని మేయర్ కు కార్పొరేటర్ విన్నవించారు. డివిజన్ లోని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ మేయర్ ఇచ్చారు. మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ బాలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగరి అశోక్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు అఫ్జల్, టిఆర్ఎస్ నాయకుడు సందీప్ తదితరులు ఉన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago