politics

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి
– నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ
– డంపు యార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్

పటాన్ చెరు:

పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని డంపు యార్డులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం మేయర్ కూకట్ పల్లి నుండి పటాన్ చెరు పట్టణానికి సందర్శించి, పనులను పరిశీలించారు. చెత్త సేకరణ, విసర్జన, పారిశుధ్య కార్మికుల పనితీరు తదితర అంశాలను స్థానిక ఉప కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ నగరాన్ని గ్రీన్ హైదరాబాద్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని అన్నారు. ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పట్టణంలో పరిశుభ్రత పరవాలేదని, మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పట్టణ ప్రజలందరూ చెత్తను జీహెచ్ఎంసీ ఆటోలోనే వేయాలని తెలిపారు. చెత్తను తీసుకువెళ్లేందుకు ఆటో వారికి మీకు తోచిన విధంగా డబ్బులు ఇవ్వాలని సూచించారు.

అనంతరం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ డివిజన్ పరిధిలోని సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. పారిశుధ్య కర్మికుల సిబ్బంది కొరతను వివరించారు. ఇంతకు ముందు బండ్లగూడ గ్రామం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా 2 సంవత్సరాల క్రితం పటాన్ చెరు డివిజన్ లో విలీనం చేయడం జరిగింది. కావున తగినంత సిబ్బందిని నియమించాలని కోరారు. నూతనంగా కలిసిన బండ్లగూడ గ్రామంతో చెత్త సేకరణకు తగినన్ని వాహనాలు లేవని కాబట్టి పారిశుధ్య పనులు సజావుగా సాగేందుకు 30 స్వచ్చ ఆటోలను, 20 స్వచ్చ రిక్షాలను, 30 చెత్త తోపుడు బండ్లు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

బండ్లగూడ గ్రామానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని అన్నారు. బండ్లగూడ గ్రామం డివిజన్ లో విలలీనమయినప్పటికి అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పాత వేతనం రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారని, కావున పటాన్ చెరు లోని పారిశుధ్య కార్మికులతో పాటు సమానవేతనం రూ.17 వేలు మంజూరు చేయగలరని వినతి పత్రం అందజేశారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలో దేశం లోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారని అందులో కార్మికులే ఎక్కువగా ఉన్నందున వారు తమ పనులకు వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటి బస్ స్టాండ్ కు వెళ్ళవలసి వస్తుంది.

ఇలా రోడ్డు దాటే క్రమంలో చాలామంది ప్రమాదాలకు గురైయ్యారని, ప్రాణాలు కూడా కోల్పోయారు. కావున బస్ స్టాండ్ పరిధిలో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నియమిస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారవుతారని మేయర్ కు కార్పొరేటర్ విన్నవించారు. డివిజన్ లోని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ మేయర్ ఇచ్చారు. మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ బాలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగరి అశోక్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు అఫ్జల్, టిఆర్ఎస్ నాయకుడు సందీప్ తదితరులు ఉన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

52 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

59 minutes ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago