పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం జిన్నారం మండలంలోని ఖజిపల్లి గ్రామంలో నిర్వహించిన పటాన్చెరు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు హరితహారం కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతరామి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు .అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతరామి రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం, పచ్చదనం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి భూగర్భ జలాలు పెంపొందించాలని,అలాగే కాలుష్య నివారణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ల్ రాములు, శ్రీనివాస్ , సత్యనారాయణ ,గ్రామ సర్పంచ్, నవీన్, ఎక్స్ సర్పంచ్ ,శ్రీనివాస్ , . సురేష్ వార్డ్ మెంబర్ , టి శ్రీనివాస్ గౌడ్ , గౌడ్ సంగం వైస్ ప్రెసిడెంట్,ఎం చిన్న వెంకన్న గౌడ్ ,ఎం రాజు గౌడ్ ,ఎం అరుణ్ గౌడ్, జనార్ధన్ టి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…