పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘ససుధెస్ట్ కుటుంబానికి యోగా అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత, గీతం హెదరాబాద్ ప్రొ వెస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మరియు రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ప్రసంగంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. యోగా గురించి, రోజువారీ జీవితంలో యోగ సాధన చేయడం వలన కలిగే ప్రయోజనాలను వారు వివరించారు. ఆరోగ్యకరమైన శరీరం, మనస్సుల కోసం, అలాగే పనిలో ఒత్తిడిని తగ్గించడానికి నిత్యం యోగ సాధన ఎలా ఉపకరిస్తుందో వాళ్ళు విడమరిచి చెప్పారు. ఇతర ఔత్సాహిక సాధకులతో కలిసి వాళ్ళు యోగా సాధనలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో యోగ నిపుణుడైన బాల క్రిష్ణ, పాల్గొని యోగ సాధనను చేయించడంతో పాటు జీవితంలో యోగా శాస్త్రీయ ఔచిత్యం, ప్రాముఖ్యతలను సాధకులకు వివరించారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గీతం స్పోర్ట్స్, స్టూడెంట్ లెస్ట్ డెరైక్టరేట్ల సమన్వయంతో ఎపిసీసీ ఎన్ఎస్ఎస్ యూనిట్ల నిర్వహించాయి.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…