Hyderabad

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

-జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్

హైదరాబాాద్:
జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌ అన్నారు. ప్రతి ఏడాది మే 22 వతేదీ అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని.. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ జీవ వైద్య మండలి, సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను  హైదరాబాద్ లాక్డికపూల్‌లోని అరణ్య భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవ వైవిద్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌, సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సీఇఓ  జోగి రితేష్ వెంకట్, అధికారులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. “
మనం పరిష్కారంలో భాగస్వామ్యులం” అనే అంశంతో ఈ ఏడాది పోటీలు నిర్వహిస్తున్నట్లు కాళీచరణ్‌ తెలిపారు. జీవి వైవిద్యం అనేది వాతావరణం, ఆరోగ్య సమస్యలు, ఆహారం, నీటి భద్రత, స్థిరమైన జీవనోనపాధికి ప్రకృతి ఆధారిత పరిష్కారాలు తిరిగి నిర్మించగల పునాది అని అన్నారు. జూనియర్‌, సీనియర్‌ అనే రెండో విభాగాల్లో 9 అంశాలతో ఈ పోటీలు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో పెయింటింగ్‌, ఫోటోగ్రఫీ, వ్యాసరచన, ప్రసంగం, నృత్యం, కార్టూన్‌ డిజైన్‌, క్విజ్‌, ఫ్యాన్సీడ్రెస్‌ ఇలా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మే 20 తేదీ లోపు www.tsepbr.org/pbr_event, facebook.com/tsbiodiversity అనే వైబ్‌సైట్‌ ద్వారా పేర్లును నమోదు చేసుకోవాలని కాళీ చరణ్ సూచించారు.
Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago