Hyderabad

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

-జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్

హైదరాబాాద్:
జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌ అన్నారు. ప్రతి ఏడాది మే 22 వతేదీ అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని.. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ జీవ వైద్య మండలి, సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను  హైదరాబాద్ లాక్డికపూల్‌లోని అరణ్య భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవ వైవిద్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌, సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సీఇఓ  జోగి రితేష్ వెంకట్, అధికారులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. “
మనం పరిష్కారంలో భాగస్వామ్యులం” అనే అంశంతో ఈ ఏడాది పోటీలు నిర్వహిస్తున్నట్లు కాళీచరణ్‌ తెలిపారు. జీవి వైవిద్యం అనేది వాతావరణం, ఆరోగ్య సమస్యలు, ఆహారం, నీటి భద్రత, స్థిరమైన జీవనోనపాధికి ప్రకృతి ఆధారిత పరిష్కారాలు తిరిగి నిర్మించగల పునాది అని అన్నారు. జూనియర్‌, సీనియర్‌ అనే రెండో విభాగాల్లో 9 అంశాలతో ఈ పోటీలు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో పెయింటింగ్‌, ఫోటోగ్రఫీ, వ్యాసరచన, ప్రసంగం, నృత్యం, కార్టూన్‌ డిజైన్‌, క్విజ్‌, ఫ్యాన్సీడ్రెస్‌ ఇలా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మే 20 తేదీ లోపు www.tsepbr.org/pbr_event, facebook.com/tsbiodiversity అనే వైబ్‌సైట్‌ ద్వారా పేర్లును నమోదు చేసుకోవాలని కాళీ చరణ్ సూచించారు.
Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago