ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి : నీలం మధు ముదిరాజ్
జహీరాబాద్ కేతకీ సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నీలం మధు దంపతులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సృష్టిలో ప్రతి అణువు పరమ శివుడే అని పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంఘం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజల్లో ఆయన సతీసమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమృత పుష్కరణలో జల లింగానికి పూజలు నిర్వహించి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర గర్భాలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నీలం కు ఘన స్వాగతం పలికారు, పూజారులు వేద మంత్రాలతో వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు .ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఆ పరమ శివుడు ఆశిస్సులతో ప్రజలంతా బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు హనుమంతరావు పాటిల్, ఆలయ ఈవో రుద్రయ్య స్వామి, సృజన్ పాటిల్,శేఖర్ పాటిల్, నవాజ్ రెడ్డి,గోపాల్,శ్రీకాంత్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి, బంటు శేఖర్, శివ,ఉత్సవా నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…