Telangana

క్రికెట్ క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత పాటించేలా చూడండి

ఎమ్మెల్యే జిఎంఆర్ ను కోరిన మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసే క్రికెట్ క్రీడాకారుల జట్టులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, పారదర్శకతతో ఎంపిక జరిగేలా చూడాలని పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంతరావు, సభ్యులు పలు అంశాలను ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేందర్రెడ్డి గత 25 సంవత్సరాలుగా ఏకచత్రాధిపత్యం వహిస్తూ.. తనకు నచ్చిన వారిని జట్టుకు ఎంపిక చేస్తున్నారని తెలిపారు. జిల్లా జట్టు ఎంపిక చేసే సమయంలో ఆయా నియోజకవర్గ పరిధిలోని క్రికెట్ క్లబ్ లను సంప్రదించడం లేదని తెలిపారు. క్రీడాకారులకు సైతం సమాచారం అందించకుండా జట్టు ఎంపిక నిర్వహిస్తూ నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా జిల్లా అసోసియేషన్కు మంజూరయ్యే నిధుల ఖర్చులో సైతం అవకతవకలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుండి ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ జట్టుకు ప్రతిభ కలిగిన క్రీడాకారులను సైతం ఎంపిక చేయడం లేదని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago