రంగోలి పోటీ, హలోవీన్-ను కూడా నిర్వహించిన విద్యార్థులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరబాదులోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం దీపోత్సవం పేరిట దీపావళి వేడుకను ఉల్లాసభరితంగా, సృజనాత్మకతను చాటేలా నిర్వహించారు.సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ప్రాంగణం లెక్కలేనన్ని దీపాల వెలుగుతో ప్రకాశించి, చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచింది. గీతం, హైదరాబాదు ప్రాంగణమంతటా ప్రతిధ్వనించే సానుకూల శక్తి, పండుగ ఉల్లాసాన్ని స్వాగతిస్తూ, దీపాల అద్భుత శక్తిని విద్యార్థులంతా కలిసి స్వీకరించారు.దీనికి ముందు, పర్యావరణ అనుకూలమైన దీపాలకు రంగులు వేయడం ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతను వ్యక్తీకరించడమే గాక, పరిసరాలను రంగులమయం చేశారు. ఈ వేడుకకు రంగోలి పోటీ జతకలిసి విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…