Districts

బహుళజాతి కంపెనీలకు ధీటుగా వర్ధమాన మార్కెట్లు..

– గీతం బీస్కూల్ ఆతిథ్య ఉపన్యాసంలో అమెరికా ప్రొఫెసర్ రామ్మూర్తి

మనవార్తలు ,పటాన్ చెరు:

వర్ధమాన మార్కెట్లు తను వ్యూహాత్మక కార్యక్రమాలను రూపొందించడంలో అంతర్జాతీయ వ్యాపారులను ఆకర్షించాయని , బహుళజాతి సంస్థలకు ధీటుగా దేశీ కంపెనీలూ రాణిస్తున్నాయని అమెరికా , బోస్టన్లోని సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ రావి రామ్మూర్తి అన్నారు . గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి ‘ బహుళజాతి కంపెనీల అంతర్జాతీయ వ్యాపార ప్రణాళిక రూపకల్పనలో భారతదేశం పాత్ర అనే అంశంసే శుక్రవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు . అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో స్థిరమైన వ్యాపార వృద్ధిని నిర్ధారించడానికి బహుళజాతి కంపెనీలు అవలంబిస్తున్న అమ్మకం , వనరులు , ఆవిష్కరణలు , నేర్చుకోవడం అనే నాలుగు పార్శ్వాలను ఆయన ఆవిష్కరించారు . జీఈ ( జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ ) జిల్లెట్ , ప్యాంపర్స్ , ఎం – బ్యాంకింగ్ వంటి ప్రపంచ బ్రాండ్ గురించి ఆయన సోదాహరణంగా వివరించారు .

తన మానస పుత్రిక అయిన ‘ రివర్స్ ఇన్నోవేషన్ ‘ ప్రక్రియను అనుసరించడంలో ‘ ప్రత్యక్ష ఉదాహరణలను ప్రొఫెసర్ రామ్మూర్తి ఈ సందర్భంగా ఉటకించారు . ఈ ఆతిథ్య ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయడంలో గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిష్ కీలక భూమిక పోషించారు . తొలుత , గీతం బీస్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అతిథిని స్వాగతించి , సత్కరించారు . ఈ కార్యక్రమంలో హెబీబీఎస్ అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొని గొప్ప అభ్యాస అనుభవాన్ని పొందారు . పలు సందేహాలను అతిథిని అడిగి నివృత్తి చేసుకున్నారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

6 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

6 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago