Telangana

క‌నుల పండువ‌గా ఎల్ల‌కొండ శ్రీ పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌ర స్వామి బ్ర‌హోత్స‌వాలు

వికారాబాద్ ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా న‌వాబుపేట మండ‌లంలోని ఎల్లకొండ శ్రీ పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌ర స్వామి జాత‌ర బ్ర‌హ్మోత్స‌వాలు క‌నుల‌పండువ‌గా సాగుతున్నాయి. శివరాత్రి పండుగ రోజున ప్రారంభ‌మ‌యిన ఈ ఉత్స‌వాలు మార్చి 12 వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు పళ్ళ భరత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ,ఏపీతో పాటు క‌ర్నాట‌క ,మ‌హారాష్ట్ర‌ల నుండి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు .మహాశివరాత్రి రోజున స్వామి వారి రుద్రాభిషేకములు, అమ్మవారికి అర్చనలు, ధ్వజారోహణము, అఖండ దీపారాధన, రాత్రికి జాగరణ, భజన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు .అష్టమి స్వామివారికి, అమ్మవారికి నిత్యార్చనలు, విశేషపూజలు అందిస్తున్న‌ట్లు ఆల‌య క‌మిటీ తెలిపింది.

08-03-2025 శనివారం ,09-03-2025 ఆదివారం,10-03-2025 సోమవారం,11-03-2025 మంగళవారం,12-03-2025 బుధవారం సప్తమి స్వామివారికి అభిషేకములు శివ సహస్రనామార్చన, కుంకుమార్చన , శేషవాహనసేవలు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు .నవమి రోజు 4.00 గంట‌ల‌కు పల్లకిసేవ ఉద‌యం ఆరు గంట‌ల‌కు అగ్నిగుండ మ‌హోత్స‌వం ,ఉద‌యం 8 గంట‌ల‌కు అభిషేకం అమ్మవారికి విశేష అర్చన 11 గంట‌ల‌నుండి పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వ‌హించ‌నున్నారు .దశమీ ఉద‌యం 8 గంట‌ల నుండి ప్రత్యేక అభిషేకములు, అర్చనలు సాయంత్రం ఆరు గంట‌ల‌కు కలశరోహణము తెల్లవారు ఝామున ఉద‌యం నాలుగు గంట‌ల‌కు ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు .ద్వాదశి రోజున నిండు జాత‌ర , త్రయోదశి రోజున నాగవెల్లి నిర్వ‌హిస్తున్నామ‌ని భ‌క్తులు ఈ ఉత్స‌వ కార్య‌క్ర‌మాల్లో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పాల్గొనాల‌న్నారు.బ్రహ్మోత్సవాల నిర్వహణలో తమ వంతుగా వస్తు రూపేణ సహాయ సహకారాలను అందించి శ్రీ పార్వతీ పరమేవశ్వరులను దర్శించి తరించి వారి కృపకు పాత్రులు కాగ‌ల‌ర‌ని ప్ర‌ధాన అర్చ‌కులు మ‌డుప‌తి నాగేశ్వ‌ర‌య్య స్వామి తెలిపారు .ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ ప్ర‌జ‌లు భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు .

admin

Recent Posts

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

2 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

2 days ago

నూతన కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…

2 days ago