వికారాబాద్ ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎల్లకొండ శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. శివరాత్రి పండుగ రోజున ప్రారంభమయిన ఈ ఉత్సవాలు మార్చి 12 వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు పళ్ళ భరత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ,ఏపీతో పాటు కర్నాటక ,మహారాష్ట్రల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు .మహాశివరాత్రి రోజున స్వామి వారి రుద్రాభిషేకములు, అమ్మవారికి అర్చనలు, ధ్వజారోహణము, అఖండ దీపారాధన, రాత్రికి జాగరణ, భజన కార్యక్రమాలు నిర్వహించారు .అష్టమి స్వామివారికి, అమ్మవారికి నిత్యార్చనలు, విశేషపూజలు అందిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో వెల్లడించిన ఏఆర్ సీఐ శాస్త్రవేత్త డాక్టర్ బులుసు శారద మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: శక్తి…