politics

బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల అవగాహన కార్యక్రమం

మనవార్తలు ,బొల్లారం:

బొల్లారం మున్సిపల్ పరిధిలోని పాత బస్తి 3వ వార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో వార్డులో వున్నా మహిళలకు అందరికి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనుల గురించి అవగహనా కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి ఆనంద్, స్థానిక కౌన్సెలర్లు టీ. కిరణ్ కుమార్ రెడ్డి,మహిళా మోర్చా ఇంచార్జి జి.పుణ్యవతి, సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి అందరు కలిసి మొక్కలు  నాటారు .

అనంతరం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి ఆనంద్ మాట్లాడుతూ కాలనీ ప్రజలందరికి ప్రధాని నరేంద్ర మోదీ గత 8 సంవత్సరాలనుండి చేపట్టిన అభివృద్ధి పనుల గురించి డ్వాక్రా గ్రూప్ సభ్యులకు మరియు కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు టీ. మేఘన రెడ్డి, కే. సరస్వతి,సీనియర్ నాయకులు ఉదయ్ కిరణ్, బాల్ సింగ్, సమ్మయ్య, హరినాథ్,ప్రధాన కార్యదర్శి రోహిత్ సింగ్,బి. సరిత, రాజేశ్వరి, శ్రీలత, కాంచన, భారీ ఎత్తున మహిళాలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago