మనవార్తలు ,నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం పెట్రో కార్ అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. నగరంలోని ఫస్ట్ టౌన్ పోలిస్ స్టేషన్కు చెందిన పెట్రోలింగ్ మొబైల్ కార్కు నగరంలో దర్నా చౌక్లో మంటలు అంటుకుని కాలిపోయింది. అప్పుడు దానిని హెడ్ కానిస్టేబుల్ పర్వేజ్ నడుపుతుండగా, మహిళ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజీవ రావు అందులో ఉన్నారు. కారు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అగ్నికిలలకు కారు మొత్తం కాలిపోయింది. పైరింజన్ వచ్చి మంటలను ఆర్పిన అది పూర్తిగా దగ్ధం అయింది. కారులో ముందుగా పొగలు రావడంతో పోలిస్లు దానిని దిగి పోవడంతో ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతోనే కారు తగలబడిపోయిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…