Telangana

గ్లీయోబ్లాస్టోమ వ్యాధిని అరుదైన చికిత్స తో మెదడు లో ఉన్న కణతి తొలగించిన మెడికేర్ హాస్పిటల్ వైద్యులు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

తలనొప్పి,తల తిరగడం లాంటి సమస్యలతో బాధపడుతున్న మహిళకు మియాపూర్ మాతృశ్రీ నగర్ లోని మెడికేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి మెదడులోని కణితి ని తొలిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియా సమావేశంలో వైద్యులు వివరాలను వెల్లడించారు డాక్టర్లు. నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన విజయ చాలాకాలంగా తల తిరగడం, తలనొప్పి ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆమె స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చూపించుకుని ఆపరేషన్ చేయించుకున్నా ప్రయోజనం లేకుండా పొయింది.అయితే ఇటీవల మియాపూర్ మాతృశ్రీనగర్ లో ఉన్న మెడికేర్ ఆస్పత్రిలో చేరిన పేషెంట్ విజయకు ఆస్పత్రిలో న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి, క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రసాద్, అనస్తీషియా డాక్టర్ హరికృష్ణలు రోగిని పరిశీలించి ఆమె మెదడులో 6.6 సెంటీమీటర్లు(మెదడులో నాలుగవ వంతు భాగం) కణతి ఉన్నట్లు నిర్దారించారు. ఆమెకు సుమారు 5 నుండి 6 గంటల పాటు శ్రమించి ఆ కణతిని తొలగించారు. ప్రస్తుతం పేషేంట్ విజయ ఆరోగ్యంగా ఉందని, మెడికేర్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ రాజు తెలిపారు.ఈ వ్యాధి లక్ష మందిలో ఇద్దరి వస్తుంది అన్ని న్యూరో సర్జన్ డాక్టర్ నవీన్ రెడ్డి తెలిపారు. తక్కువ ఖర్చుతో అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తున్నామని, కార్పొరేట్ ఆస్పత్రి అయినా అందరికీ అందుబాటు ధరల్లో వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పేషేంట్ విజయ, డాక్టర్ల బృందం పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago