మనవార్తలు , శేరిలింగంపల్లి :
తలనొప్పి,తల తిరగడం లాంటి సమస్యలతో బాధపడుతున్న మహిళకు మియాపూర్ మాతృశ్రీ నగర్ లోని మెడికేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి మెదడులోని కణితి ని తొలిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియా సమావేశంలో వైద్యులు వివరాలను వెల్లడించారు డాక్టర్లు. నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన విజయ చాలాకాలంగా తల తిరగడం, తలనొప్పి ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆమె స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చూపించుకుని ఆపరేషన్ చేయించుకున్నా ప్రయోజనం లేకుండా పొయింది.అయితే ఇటీవల మియాపూర్ మాతృశ్రీనగర్ లో ఉన్న మెడికేర్ ఆస్పత్రిలో చేరిన పేషెంట్ విజయకు ఆస్పత్రిలో న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి, క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రసాద్, అనస్తీషియా డాక్టర్ హరికృష్ణలు రోగిని పరిశీలించి ఆమె మెదడులో 6.6 సెంటీమీటర్లు(మెదడులో నాలుగవ వంతు భాగం) కణతి ఉన్నట్లు నిర్దారించారు. ఆమెకు సుమారు 5 నుండి 6 గంటల పాటు శ్రమించి ఆ కణతిని తొలగించారు. ప్రస్తుతం పేషేంట్ విజయ ఆరోగ్యంగా ఉందని, మెడికేర్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ రాజు తెలిపారు.ఈ వ్యాధి లక్ష మందిలో ఇద్దరి వస్తుంది అన్ని న్యూరో సర్జన్ డాక్టర్ నవీన్ రెడ్డి తెలిపారు. తక్కువ ఖర్చుతో అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తున్నామని, కార్పొరేట్ ఆస్పత్రి అయినా అందరికీ అందుబాటు ధరల్లో వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పేషేంట్ విజయ, డాక్టర్ల బృందం పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…