గీతం స్కాలర్ రమాదేవికి డాక్టరేట్….
హైదరాబాద్:
సవరించిన ఏరియా జనరేషన్ టెక్నిక్ తో సమర్థవంతమైన చిత్రాన్ని ఆవిష్కరించడంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థిని వి.రమాదేవిని డాక్టరేట్ వరించింది.
ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మంజునాథాచారి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . ఈ పరిశోధనలో వేద గణితాలను ఉపయోగించి సవరించిన ఏరియో జనరేషన్ టెక్నిక్ స్కేలర్ తో సమర్థవంతమైన ఇమేజ్ స్కేలింగ్ ప్రాసెసర్ తక్కువ మెమరీ అవసరాలు , అధిక నాణ్యత , అధిక పనితీరుతో రియల్ టైమ్ ఇమేజ్ మెరుగుదల అనువర్తనాల కోసం తక్కువ ఖర్చుతో , తక్కువ శక్తి గల వీఎన్ఎస్ఏ సర్క్యూట్ను రూపొందించడానికి ప్రతిపాదించినట్టు ప్రొఫెసర్ మంజునాథాచారి వివరించారు . ప్రతిపాదిత రూపకల్పనలో చిత్ర నాణ్యతను అభివృద్ధి చేయడానికి సమర్థవంతమైన ఎడ్జ్ క్యాప్చర్ టెక్నిక్ , తక్కువ సంక్లిష్టతతో పదునైన ఫిల్టర్ ఉపయోగించినట్టు ఆయన తెలిపారు . గణన సంక్లిష్టతను , ప్రతిపాదిత రూపకల్పన హార్డ్ వేర్ ఖర్చులను తగ్గించడానికి వేద గణితం ఉపయోగించామని , రౌండింగ్ లోపం దిద్దుబాటు పద్ధతులను ఉపయోగించకుండా ఈ పద్ధతి అమలు చేస్తారన్నారు . రమాదేవి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ . స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…