MUTYALAMMA
కనులపండువగా సాగిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ విగ్రహప్రతిష్ఠాపన
పటాన్ చెరు:
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభవృద్దికి పెద్ద పీట వేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు .ముఖ్యంగా తెలంగాణలో వెయ్యికోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు చైతన్య నగర్ కాలనీలో సొంత నిధులతో జీర్ణోద్దరణ గావించిన ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని …మానవసేవే మాధవ సేవ అనే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు . ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయి ప్రజలంతా శుఖ శాంతులతో వర్థిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అన్నారు . అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాప కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మెట్టుకుమార్ యాదవ్,టీఆర్ఎస్ సీనియర్ నేత విజయ్ కుమార్ వెంకటేష్ , ఆలయ కమిటీ సభ్యులు ,కాలనీ వాసులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…