MUTYALAMMA
కనులపండువగా సాగిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ విగ్రహప్రతిష్ఠాపన
పటాన్ చెరు:
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభవృద్దికి పెద్ద పీట వేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు .ముఖ్యంగా తెలంగాణలో వెయ్యికోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు చైతన్య నగర్ కాలనీలో సొంత నిధులతో జీర్ణోద్దరణ గావించిన ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని …మానవసేవే మాధవ సేవ అనే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు . ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయి ప్రజలంతా శుఖ శాంతులతో వర్థిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అన్నారు . అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాప కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మెట్టుకుమార్ యాదవ్,టీఆర్ఎస్ సీనియర్ నేత విజయ్ కుమార్ వెంకటేష్ , ఆలయ కమిటీ సభ్యులు ,కాలనీ వాసులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…