Hyderabad

సమన్వయంతో ఆవిష్కరణలు- అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యక్షుడు శ్రీభరత్

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యక్షుడు శ్రీభరత్

 

పటాన్ చెరు:

రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల మధ్య సమన్వయం, పరిశోధకుల మధ్య భాగస్వామ్య అధ్యయనాల ద్వారా నూతన ఆవిష్కరణలు సాధ్యపడతాయని గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల అభివృద్ధి అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు (వెబినార్) సోమవారం ఆరంభమైంది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానానికి పరిధులు లేవని, అంతర్ విభాగ పరిశోధనలతో కొత్త అంశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ స్కూల్ పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, విశాఖలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శరత్ చంద్రబాబు, సదస్సు కన్వీనర్లు డాక్టర్ ఎ.రత్నమాల, డాక్టర్ వందన తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

పట్టణ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పాదన:సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా పట్టణ వ్యర్థాలను విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించుకోవచ్చునని అమెరికాలో యంగ్ టౌన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధన బృందం నిపుణుడు ప్రొఫెసర్ క్లోవిస్ లిన్ కాన్ తెలిపారు. పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే విషపూరిత వ్యర్థాలను సయితం ఎలక్ట్రో కెమిస్ట్రీ పరిజ్ఞానం ఆధారంగా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించుకునే విధానాన్ని ఆయన వివరించారు. మలేసియా విశ్వవిద్యాలయం పరిశోధకుడు డాక్టర్ గాబ్రియేల్ ఔషధ పరిశోధనలకు వినియోగిస్తున్న నూతన ఏటీఆర్ – ఎస్ఎఆర్ స్పెక్ట్రోస్కోప్ గురించి వివరించారు. ప్రొఫెసర్ ఎం.రామారావు, ప్రొఫెసర్ ఆర్.వెంకటనాలు సదస్సు చైర్మన్లుగా వ్యవహరించారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన దాదాపు 250 మంది శాస్త్ర నిపుణులు పాల్గొంటున్నారు. మరో రెండు రోజులపాటు ఈ సదస్సు కొనసాగనుంది.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago