Hyderabad

సమన్వయంతో ఆవిష్కరణలు- అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యక్షుడు శ్రీభరత్

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యక్షుడు శ్రీభరత్

 

పటాన్ చెరు:

రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల మధ్య సమన్వయం, పరిశోధకుల మధ్య భాగస్వామ్య అధ్యయనాల ద్వారా నూతన ఆవిష్కరణలు సాధ్యపడతాయని గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల అభివృద్ధి అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు (వెబినార్) సోమవారం ఆరంభమైంది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానానికి పరిధులు లేవని, అంతర్ విభాగ పరిశోధనలతో కొత్త అంశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ స్కూల్ పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, విశాఖలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శరత్ చంద్రబాబు, సదస్సు కన్వీనర్లు డాక్టర్ ఎ.రత్నమాల, డాక్టర్ వందన తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

పట్టణ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పాదన:సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా పట్టణ వ్యర్థాలను విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించుకోవచ్చునని అమెరికాలో యంగ్ టౌన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధన బృందం నిపుణుడు ప్రొఫెసర్ క్లోవిస్ లిన్ కాన్ తెలిపారు. పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే విషపూరిత వ్యర్థాలను సయితం ఎలక్ట్రో కెమిస్ట్రీ పరిజ్ఞానం ఆధారంగా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించుకునే విధానాన్ని ఆయన వివరించారు. మలేసియా విశ్వవిద్యాలయం పరిశోధకుడు డాక్టర్ గాబ్రియేల్ ఔషధ పరిశోధనలకు వినియోగిస్తున్న నూతన ఏటీఆర్ – ఎస్ఎఆర్ స్పెక్ట్రోస్కోప్ గురించి వివరించారు. ప్రొఫెసర్ ఎం.రామారావు, ప్రొఫెసర్ ఆర్.వెంకటనాలు సదస్సు చైర్మన్లుగా వ్యవహరించారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన దాదాపు 250 మంది శాస్త్ర నిపుణులు పాల్గొంటున్నారు. మరో రెండు రోజులపాటు ఈ సదస్సు కొనసాగనుంది.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago