Telangana

సమాజం నుంచి జవాబు ఆశించిందే దళిత రచన…

– దళితుల రచనలపై జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రొఫెసర్ యేసుదాసన్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దళితుల రచనలు సమాజం, సంస్కృతి నుంచి సమాధానాన్ని ఆశిస్తాయని కొట్టాయంలోని సీఎంఎస్ కళాశాల రిటెర్డ్ ప్రొఫెసర్ టి.ఎం. యేసుదాసన్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ఎస్) ఆధ్వర్యంలో ‘వ్యవహారిక పత్రికలు, దళిత రచనలు, వెలువరించడంలోని సాదక బాధకాలు’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు.కులం పరివర్తన చెంది, కుల సంఘాలుగా కొత్త రూపం దాల్చిందని, ప్రతి కులం పేరుతో సంఘాలు ఉన్నాయని ఆయన చెప్పారు. దళిత పత్రికలు అరుదుగా వెలువడ్డా, తదనంతర కాలంలో కనుమరుగయ్యాయని అన్నారు. రాయడం, రాయకపోవడం, చదవడం, చదవకపోవడం, గొంతులేనితనంతో పాటు సామాజిక సంబంధాలు, మలయాళ దళిత పత్రికల చరిత్ర, కుల సంఘాల పాత్ర, పత్రికల పాత్ర, వాటి సహకారం మొదలైన అంశాలను ప్రొఫెసర్ యేసుదాసన్ వివరించారు.హెచ్ఎస్ ఇన్చార్జి డెరైక్టర్ ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ ఈ ప్రారంభోత్సవానికి అధ్యక్షత తొలుత, జీఎస్ వహించగా, నిర్వాహకుడు డాక్టర్ సయంతన్ మోండల్ స్వాగతోపన్యాసం చేశారు. మరో కన్వీనర్ డాక్టర్ జోంధాలే. రాహుల్ హిరామన్ వందన సమర్పణతో ఈ ప్రారంభోత్సవం ముగిసింది.జేవీ పవార్, కళ్యాణి ఠాకూర్ చరల్, నకుల్ మాలిక్, ప్రొఫెసర్ రేఖా మెష్రమ్, ప్రొఫెసర్ జె.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ రాజ్కుమార్ హన్స్, హరీష్ మంగళం, ప్రొఫెసర్ సిప్రా ముఖర్జీ, ప్రొఫెసర్ పి. తిరుమల్, ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ వంటి ప్రముఖ వక్తలు ఈ సదస్సులో పాల్గొని, తమ అభిప్రాయాలను సదస్యులతో పంచుకోనున్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago