Telangana

ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోండి…

– విద్యార్థులకు జిల్లా పరిషత్ హెస్ట్కూల్ హెడ్ మాస్టర్ రమాదేవి ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థులంతా ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోవాలని, ఆ లక్షణం ఉన్న వారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రుద్రారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. రమాదేవి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘జాతీయ సైన్స్ దినోత్సవం’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరణలకు బాటలు వేసిందని, శాస్త్రీయ ఫలాలు సామాన్య మానవుల శ్రేయస్సుకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో ఆహారం, శక్తి కొరతను మానవాళి ఎదుర్కోబోతోందని, వాటికి ప్రత్యామ్నాయాలను కనుగొనాలని భావి శాస్త్రవేత్తలకు ఆమె సూచించారు.

తొలుత, స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష అధ్యక్షోపన్యాసం చేయగా, రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీవీ నాగేంద్ర కుమార్ వందన సమర్పణ చేశారు. గీతం బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి తదితరులు శాస్త్రీయంగా మానవాళికి ఇతోధిక సేవలందించిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవడంతో పాటు తమ పాఠశాల రోజులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తృణ ధాన్యాలపై రూపొందించిన వార్షిక ఈ-పత్రికను ఆవిష్కరించారు.

ఆ తరువాత రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన శాస్త్రీయ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పలు మోడళ్ళు ఎలా పనిచేస్తున్నాయో, వాటి వెనుక ఉన్న సెన్స్డ్ ఏమిటి అనే అంశాలను విద్యార్థులు అడిగి తెలుసుకోవడం ముచ్చటేసింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago