Telangana

ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోండి…

– విద్యార్థులకు జిల్లా పరిషత్ హెస్ట్కూల్ హెడ్ మాస్టర్ రమాదేవి ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థులంతా ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోవాలని, ఆ లక్షణం ఉన్న వారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రుద్రారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. రమాదేవి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘జాతీయ సైన్స్ దినోత్సవం’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరణలకు బాటలు వేసిందని, శాస్త్రీయ ఫలాలు సామాన్య మానవుల శ్రేయస్సుకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో ఆహారం, శక్తి కొరతను మానవాళి ఎదుర్కోబోతోందని, వాటికి ప్రత్యామ్నాయాలను కనుగొనాలని భావి శాస్త్రవేత్తలకు ఆమె సూచించారు.

తొలుత, స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష అధ్యక్షోపన్యాసం చేయగా, రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీవీ నాగేంద్ర కుమార్ వందన సమర్పణ చేశారు. గీతం బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి తదితరులు శాస్త్రీయంగా మానవాళికి ఇతోధిక సేవలందించిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవడంతో పాటు తమ పాఠశాల రోజులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తృణ ధాన్యాలపై రూపొందించిన వార్షిక ఈ-పత్రికను ఆవిష్కరించారు.

ఆ తరువాత రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన శాస్త్రీయ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పలు మోడళ్ళు ఎలా పనిచేస్తున్నాయో, వాటి వెనుక ఉన్న సెన్స్డ్ ఏమిటి అనే అంశాలను విద్యార్థులు అడిగి తెలుసుకోవడం ముచ్చటేసింది.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago