బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గురువారం బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో కలశ యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి దంపతులు ముఖ్యఅతిథిగా హాజరై కలశ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక దుర్గామాత ఆలయంలో చంద్రారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలను మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరి ఆచార సంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రారెడ్డి దంపతులను స్థానిక మహిళలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి గారు, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మా రెడ్డి గారు, మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆనంద్ కృష్ణ రెడ్డి , స్థానిక నాయకులు రమణయ్య , రాజ్ గోపాల్ , దిననాధ్ , జె.జె సింగ్ గారు, రాజారామ్, శ్రీమన్నారాయణ , చంద్రశేఖర్ , శ్రవణ్ , మా అంబి మహిళా సేవాసమితి సభ్యులు దుర్గవతి , పరంశీల , ప్రమీల దేవి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…