మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
హోప్ అఫ్ హంగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఆశయంతో ప్రొజెక్ట్ నారీ తేజం పేరుతో మొదటి దశలో భాగంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇరవై మంది నిరుపేద మహిళలకు మూడు నెలల పాటు కుట్టు మిషన్ (స్ట్రిచింగ్) నైపుణ్య శిక్షణ కోర్సును నేర్పించారు. కోర్సు పూర్తిచేసుకున్న మహిళలకు డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా టైలరింగ్ శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందించారు . అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ శిక్షణ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న మహిళలందరు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియచేసారు. డివిజన్ లోని పేద ప్రజలకు సేవ చేస్తున్న హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్యకు కృతజ్ఞతలు తెలియచేసారు. మా డివిజన్ లో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని అటువంటి వారికి అండగా నిలుస్తూ ప్రాజెక్ట్ నారీ తేజం లో భాగంగా నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పిస్తున్న హోప్ ఆఫ్ హాంగర్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అలేఖ్య, వెంకటేశ్వరరావు, రవి కిరణ్, మీరయ్య, ఇందిరరాణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…