మనవార్తలు ,పటాన్ చెరు:
నిమ్న జాతుల అభ్యుదయానికి నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని యువజన నాయకుడు శివారెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం ఐనోల్ గ్రామంలో తన సొంత ఖర్చు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… న్యాయవాదిగా రాజకీయవేత్తగా ఆర్థిక సంఘ సంస్కర్తగా ఎన్నో సేవలు అందించిన మహనీయుడు అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటానికి నాంది పలకడం జరిగిందని తద్వారా సొంత రాష్ట్రాన్ని తద్వారా సొంత రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని తెలిపారు. రిజర్వేషన్లతో అట్టడుగు వర్గాల వారికి సమాన హక్కులు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచి జరిగిందన్నారు.నేటి తరానికి ఆయన ఆలోచనలు అనుసరణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి,మోహన్ రెడ్డి,జంగాయా,శ్రీశైలం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…