Hyderabad

పెట్రోల్, డీజిల్, పెంచిన ధరలకు నిరసన…

పెట్రోల్, డీజిల్, పెంచిన ధరలకు నిరసన…

పటాన్ చెరు:

బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా శుక్రవారం పటాన్ చెరు పట్టణంలో పెట్రోల్ బంక్ ఎదురుగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కె.నరసింహా రెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్ చెరు పట్టణంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ప్రభుత్వంలో 2014 వరకు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర వంద డాలర్లకు చేరినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పేట్రోల్, డీజిల్ ధరలు 55, 60 రూపాయలకు మించి లేదని అన్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ బ్యారేల్ ధర 40 డాలర్లకు చేరుకున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధర 100 రూపాయలు చేరుకోవడం సిగ్గుచేటని అన్నారు. కరోనా సమయంలో దేశంలో మధ్యతరగతి పేదరికంలో ఉన్నవారు కరోనా చికిత్స, ఉపాధి లేక లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు 41 సార్లు గడిచిన ఐదు నెలల్లో పెంచడంతో వాణిజ్య వాహనాల పైన అధిక భారం పడడంతో రవాణా ఖర్చులు పెరిగి మంచి నూనె కిలో వంద రూపాయల నుండి రెండు వందల రూపాయలకు పెరిగాయి. అలాగే నిత్యవసర వస్తువులు పప్పులు, కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్ని అంటాయి. గ్యాస్ ధర రెట్టింపు అయ్యింది. దీని ద్వారా పేదరికంలో ఉన్న వారిని ఇంకా పేదరికంలోకి మోడీ ప్రభుత్వం నెట్టిందని అన్నారు.

కరోనా సమయంలో గతంలో మోడీ ప్రభుత్వము 20 లక్షల కోట్ల రూపాయలు పేదలకు ఇస్తామని చెప్పి ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ నుండి గెలిచిన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల పైన ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిచక పోవడం అత్యంత విచారకరమని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న నిత్యావసర వస్తువులు పెట్రోల్, డీజిల్ ప్రజలకు భారం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు యువ రాజ్ మొరే, రతన్ సింగ్, అంజయ్య, మధు, రాములు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago