Telangana

బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది నీలం మధు ముదిరాజ్

శివనగర్ లో 15 లక్షల సొంత నిధులతో నిర్మించిన

ముదిరాజ్ సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం

కాంగ్రెస్ పార్టీకి,రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నీలం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో నీలం మధు తన సొంత నిధులు 15 లక్షలు వెచ్చించి నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బహుజనులకు అందులో ముఖ్యంగా ముదిరాజ్ లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి గౌరవిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ముదిరాజ్ లను కేవలం ఓటు బ్యాంకు గా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజ్ లను పాలనలో భాగస్వాములను చేశారని తెలిపారు. అందుకు ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఉదాహరణ అని కొనియాడారు.

కాంగ్రెస్ చేపట్టిన బీసీ కులగణన ను బీసీలందరూ వినియోగించుకోవాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులు రాజకీయంగా బలపడాలని సూచించారు. మనలో రాజకీయ చైతన్యం వస్తేనే మన బిడ్డలు రాజకీయంగా బలపడితేనే మన జాతులకు గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు. ముదిరాజ్ ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లానని త్వరలో ఆ సమస్యలు పరిష్కారం చేసుకుందామన్నారు.

ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వీర్నల సత్యనారాయణ,ఆత్మ కమిటి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కుంచల ప్రభాకర్,మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ,మాజీ ఎంపీటీసీ మహేష్,నీరుడి కృష్ణ, నర్సింలు,అశోక్,అన్వర్ పటేల్,మహేష్, శ్రీనివాస్, జాకీ, మల్లేష్, నర్సింలు, కాంగ్రెస్ శ్రేణులు,సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతిభా ప్రదర్శన వేదికగా ‘సాధన-2026’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…

7 hours ago

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :…

1 day ago

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

4 days ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

4 days ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

5 days ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

5 days ago