శివనగర్ లో 15 లక్షల సొంత నిధులతో నిర్మించిన
ముదిరాజ్ సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం
కాంగ్రెస్ పార్టీకి,రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నీలం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో నీలం మధు తన సొంత నిధులు 15 లక్షలు వెచ్చించి నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బహుజనులకు అందులో ముఖ్యంగా ముదిరాజ్ లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి గౌరవిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ముదిరాజ్ లను కేవలం ఓటు బ్యాంకు గా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజ్ లను పాలనలో భాగస్వాములను చేశారని తెలిపారు. అందుకు ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఉదాహరణ అని కొనియాడారు.
కాంగ్రెస్ చేపట్టిన బీసీ కులగణన ను బీసీలందరూ వినియోగించుకోవాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులు రాజకీయంగా బలపడాలని సూచించారు. మనలో రాజకీయ చైతన్యం వస్తేనే మన బిడ్డలు రాజకీయంగా బలపడితేనే మన జాతులకు గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు. ముదిరాజ్ ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లానని త్వరలో ఆ సమస్యలు పరిష్కారం చేసుకుందామన్నారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వీర్నల సత్యనారాయణ,ఆత్మ కమిటి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కుంచల ప్రభాకర్,మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ,మాజీ ఎంపీటీసీ మహేష్,నీరుడి కృష్ణ, నర్సింలు,అశోక్,అన్వర్ పటేల్,మహేష్, శ్రీనివాస్, జాకీ, మల్లేష్, నర్సింలు, కాంగ్రెస్ శ్రేణులు,సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…