politics

తప్పుడు వార్తలను ఖండిస్తున్నాo – సి ఐ ఎఫ్ ఎల్ ప్రతినిధులు

_వాస్తవాలు తెలుసుకుంటే మంచిది

_లేదంటే పరువు నష్టం దావా వేస్తాం – సి ఐ ఎఫ్ ఎల్ ప్రతినిధులు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఆలిండ్ కంపెనీ ల్యాండ్ కబ్జా అంటూ కొన్ని ప్రచార సాధనాల్లో వచ్చిన వార్తలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కమర్షియల్ ఇండస్ట్రీస్ ఫైనాన్స్ లిమిటెడ్ (సి ఐ ఎఫ్ ఎల్ ) ప్రతినిధులు. పత్రికా ప్రకటనను విడుదల చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని 137, 138 మరియు 139 సర్వేనెంబర్ల లోని 45 ఎకరాల భూమిని 1959 సంవత్సరంలో, 94, 95,96,97,102 మరియు 103/1 అండ్ 2 లో గల 60 ఎకరాల భూమిని 1960 లో హైదరాబాద్ నేషనల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వద్ద. కమర్షియల్ ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ లిమిటెడ్ పేరుతో కొనుగోలు చేశామని తెలిపారు. కాగా ఇందులో నుండి 1961 సంవత్సరంలో 45 ఎకరాలను ఆలిండ్ కంపెనీకి విక్రయించామని పేర్కొన్నారు.

మిగిలిన భూమిని కమిడి రియాలిటీ. ప్రయివేట్ లిమిటెడ్ మరియు కె ఎన్ ఆర్ ప్రతినిధులకు. 2021 లో అమ్మామని తెలిపారు. ఇటీవల సదరు అమ్మామని, కమిడి రియాలిటీ ప్రయివేట్ లిమిటెడ్ మరియు కె ఎన్ ఆర్ ప్రతినిధులు సదరు భూమిలోకి వెళ్లి చదును చేసుకోగా దీన్ని ఓర్వలేని ఆలిండ్ కంపెనీ ప్రతినిధులు తమ భూమి కొనుగోలు దారుల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని ఆసరా గా చేసుకొని కొన్ని పత్రికలు, ప్రచారసాధనాలు నిజానిజాలు తెలుసుకోకుండా ఆక్రమణ, చొరబాటు అంటూ తప్పుడు వార్త కథనాలు ప్రచురించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆలిండ్ కంపెనీ వారు కార్మికుల శ్రేయస్సు కోసం కంపెనీ ని నడపకుండా దాన్ని మూసేసి కార్మికులను రోడ్డుపాలు చేసి ఇపుడు సినిమా షూటింగ్ లకు స్థలాన్ని లీజుకిచ్చుకుంటు వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.

కోర్టు ఆదేశాలనుసారం రెవెన్యూ డిపార్ట్ మెంట్ వారు సర్వే చేసి ఇచ్చాకే తమ కొనుగోలు దారులు సదరు స్థలం లోకి వెళ్తే దాన్ని చొరబాటు అని ఎలా అంటారని ప్రశ్నించారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ చేసిన సర్వే నే తప్పంటు ఆరోపించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. మొగాన్ని మొత్తి మొర్రో మొర్రో అన్నట్లు వారే తప్పు చేస్తూ ఆ తప్పులను ఇతరులపైకి దొప్పడం సరైంది కాదన్నారు. దొంగే దొంగా, దొంగా అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ కె ఎన్ ఆర్ సంస్థ ను అభాసు పాలు చెయ్యాలని చూస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని వారు హెచ్చరించారు.

admin

Recent Posts

ప్రతిభా ప్రదర్శన వేదికగా ‘సాధన-2026’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…

8 hours ago

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :…

1 day ago

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

4 days ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

4 days ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

5 days ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

5 days ago