Districts

గడువులోగా ఎన్ఆర్ఈజీఎస్ పనులు పూర్తి చేయండి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్చెరు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులను గడువులోగా పూర్తి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పటాన్చెరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల పురోగతి పై అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

ప్రభుత్వం నుండి విడుదలయ్యే నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే గ్రామంలో ప్రజాప్రతినిధులకు సమాజంలో తగిన విలువ ఉంటుందని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా పటాన్చెరు నియోజకవర్గానికి ఐదు కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు కాగా, పటాన్చెరు మండలానికి 2 కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. వీటి ద్వారా మండల పరిధిలోని 19 గ్రామాలలో సిసి రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ లోపు అన్ని నిర్మాణాలు పూర్తి చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

పంచాయతీరాజ్ శాఖ ద్వారా నియోజకవర్గంలోని గ్రామాలలో రహదారులు నిర్మించేందుకు 23 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. జిహెచ్ఎంసి, మున్సిపాలిటీలకు సైతం 50 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇక చదవండి

అమీన్పూర్ మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago