Districts

అమీన్పూర్ మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , అమీన్పూర్

ప్రజలకు జవాబుదారీగా పనిచేసి వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పాలకవర్గం ఏర్పడే రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఛైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎప్పటికప్పుడు ప్రజలు, ప్రజాప్రతినిధుల ద్వారా సమస్యలను సేకరించి తదనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేయాలని కోరారు. మున్సిపల్ పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. రెండేళ్ల కాలంలో 68 కోట్ల రూపాయలతో మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఆయన పాలకవర్గాన్ని అభినందించారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథను విస్తరిస్తున్నామని, ఇందుకోసం భారీ రిజర్వాయర్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి అమీన్పూర్ అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సమావేశంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

9 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

9 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

9 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

9 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

2 days ago