Telangana

వెంకట్ రెడ్డి కాలనీలో ఓపెన్ డ్రైనేజీ పనులపై జోనల్ కమిషనర్ కార్యాలయం లో ఫిర్యాదు

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

వెంకట్ రెడ్డి కాలనీ లో అసంపూర్తిగా ఉన్న ఓపెన్ డ్రైనేజీ సమస్య పరిశరించాలని కోరుతూ స్థానిక ప్రజలతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ సోమవారం రోజు జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించారు. కాలనీలో అసంపూర్తిగా వదిలిపెట్టిన ఓపెన్ డ్రైనేజీ కారణంగా తీవ్ర దుర్వాసన వ్యాపిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ ప్రాంతం నివసించడానికి అనర్హంగా మారిందని స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ, ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు నిత్యం అనారోగ్యకర పరిస్థితులనుఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు నీటి దుర్వాసనతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ప్రజల తరఫున వెంటనే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.ఫిర్యాదుపై స్పందించిన జోనల్ కమిషనర్ కార్యాలయ అధికారులు 10 రోజుల్లో సమస్యకు పరిష్కారం కనుగొని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అశోక్, శ్రీధర్, ప్రభాకర్, జ్ఞానేశ్వర్, ఆకాశ్, దశరథ్, కిరణ్, ముక్తేదార్, సలీమ్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago