Telangana

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంగా సీఎం కప్ పోటీలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని కెంపు కార్యాలయంలో సీఎం కప్ 2024 క్రీడా పోటీలపై నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల అధికారులతో ఆయన సమావేశమయ్యారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ నుండి రాష్ట్ర స్థాయి వరకు అథ్లెటిక్స్, ఫుట్ బాల్, వాలీ బాల్, కబడ్డీ, కోకో, యోగ తదితర అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. గ్రామీణ, మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జట్టులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు. క్రీడలపై ఆసక్తి కలిగిన ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అండర్ 14, అండర్ 18, సీనియర్ స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయని తెలిపారు. డిసెంబర్ 7, 8 తేదీలలో గ్రామపంచాయతీ స్థాయిలో,‌ డిసెంబర్ 10, 11, 12 తేదీలలో మండల మరియు మున్సిపల్ స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయని తెలిపారు. క్రీడా పోటీలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో లోపాలు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు..

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

7 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

19 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

19 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

19 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

19 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago