పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని కెంపు కార్యాలయంలో సీఎం కప్ 2024 క్రీడా పోటీలపై నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల అధికారులతో ఆయన సమావేశమయ్యారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ నుండి రాష్ట్ర స్థాయి వరకు అథ్లెటిక్స్, ఫుట్ బాల్, వాలీ బాల్, కబడ్డీ, కోకో, యోగ తదితర అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. గ్రామీణ, మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జట్టులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు. క్రీడలపై ఆసక్తి కలిగిన ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అండర్ 14, అండర్ 18, సీనియర్ స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయని తెలిపారు. డిసెంబర్ 7, 8 తేదీలలో గ్రామపంచాయతీ స్థాయిలో, డిసెంబర్ 10, 11, 12 తేదీలలో మండల మరియు మున్సిపల్ స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయని తెలిపారు. క్రీడా పోటీలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో లోపాలు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు..
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…