Telangana

స్వచ్ఛ సర్వేక్షన్ ను విజయవంతం చేయాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేస్తూ విజయవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు.స్వచ్ఛ సర్వేక్షన్ 2023 అమలుపై మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో కార్పోరేటర్లు, జిహెచ్ఎంసి, విద్యుత్తు, పోలీసు, హెచ్ఎండబ్లుఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీ నగర్ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడం, బహిరంగంగా వ్యర్థాలు పారవేయకుండా చూడడం, చెత్త వేసే ప్రదేశాలను గుర్తించడం, మురిగినీటి కాలువలు, నాళాల చుట్టూ ఫెన్సింగ్లు వేయడం, స్వచ్ఛ వార్డులు గుర్తించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

స్వచ్ఛతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే కాలనీలకు అవార్డులు అందించాలని కోరారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ కనెక్షన్లు సరి చూడడం, పాత స్తంభాల స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. పోలీస్ శాఖ కాలనీలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మూడు డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

59 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago