Telangana

పండుగ వాతావరణం లో అమీన్పూర్ మండల మున్సిపల్. బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.

_భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు

_బి ఆర్ ఎస్ కు బలం.. బలగం కార్యకర్తలే

_కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు..

అమీన్పూర్.మనవార్తలు ప్రతినిధి :

స్వరాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, బిఆర్ఎస్ పార్టీకి బలం బలగం కార్యకర్తలేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం సాయంత్రం బీరంగూడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్, మండల స్థాయి ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బీరంగూడ కమాన్ నుండి ఫంక్షన్ హాల్ వరకు భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీతో ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 60 లక్షల మంది సభ్యత్వంతో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అజేయ శక్తిగా నిలిచిందని అన్నారు. పార్టీ పటిష్టతకు వెన్నుముకగా నిలిచిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కార్యకర్తలు పని చేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గడపగడపకు వివరించాలని కోరారు.గత ప్రభుత్వాల హాయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పల్లెలు, పట్టణాలను ఎనిమిదేళ్ల కాలంలోనే అభివృద్ధిలో ఆదర్శంగా, సంక్షేమంలో నెంబర్ వన్ గా నిలిపామని తెలిపారు. అసాధ్యం అనుకున్న పనులను సైతం సుసాధ్యం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కిందని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అమీన్పూర్ గ్రామాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసి.. ప్రతి కాలనీని అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట వరకు 75 కోట్ల రూపాయలతో 100 ఫీట్ల రహదారిని నిర్మించడంతోపాటు.. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా నాలుగు భారీ రిజర్వాయర్ల పనులను చేపట్టామని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారంలో పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకతతో పని చేస్తున్నామని తెలిపారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో హ్యాట్రిక్ విజయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు..ఈ సమావేశంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు ఈర్ల రాజు, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, అయ్యా వార్డుల కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago