Telangana

స్వచ్ఛ సర్వేక్షన్ ను విజయవంతం చేయాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేస్తూ విజయవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు.స్వచ్ఛ సర్వేక్షన్ 2023 అమలుపై మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో కార్పోరేటర్లు, జిహెచ్ఎంసి, విద్యుత్తు, పోలీసు, హెచ్ఎండబ్లుఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీ నగర్ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడం, బహిరంగంగా వ్యర్థాలు పారవేయకుండా చూడడం, చెత్త వేసే ప్రదేశాలను గుర్తించడం, మురిగినీటి కాలువలు, నాళాల చుట్టూ ఫెన్సింగ్లు వేయడం, స్వచ్ఛ వార్డులు గుర్తించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

స్వచ్ఛతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే కాలనీలకు అవార్డులు అందించాలని కోరారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ కనెక్షన్లు సరి చూడడం, పాత స్తంభాల స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. పోలీస్ శాఖ కాలనీలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మూడు డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ గా సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ మాజీద్ అలీ

-రాష్ట్రస్థాయి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అవగాహన సదస్సు రవీంద్ర భారతిలో నిర్వాహణ -ప్రజల్లో చైతన్యం పెంచేందుకు మీడియా…

5 hours ago

గీతంలో పీహెచ్.డీ. ప్రవేశాలు

ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మసీ, హ్యుమానిటీస్, లాలో ఫుల్-టైమ్ కోర్సులు పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తల కోసం ఎక్స్ ట్రామ్యూరల్…

8 hours ago

నేడు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బేతాళ స్వామి జాతరలో. అంబలి, అన్నదానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తాము చదువుతున్న ఊరికి, జాతరకు వచ్చే భక్తులకు ఎండ వేడిమిని నుండి ఉపశమనం…

2 days ago

అధునాతన ఔషధ పరిశోధనలో సమగ్ర శిక్షణ

గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026 మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

3 days ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

3 days ago