Telangana

కిర్బీ పరిశ్రమలో సీఐటీయూ చారిత్రాత్మికమైన వేతన ఒప్పందం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

117 మంది క్యాజువల్ కార్మికుల పర్మినెంట్

గ్రాస్ సాలరీలోరూ.10,545/-, సిటీసిలో రూ.12,486/- నెల వేతనం పెంపు

రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక నెల గ్రాస్ శాలరీ

కార్మికుల భద్రత, సంక్షేమం సిఐటియుతోనే సాధ్యం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

పాశమైలారం పారిశ్రామిక వాడ లోని కిర్బీ పరిశ్రమలో సిఐటియు ఆధ్వర్యంలో చారిత్రాత్మకమైన వేతన ఒప్పందం సాధించామని, ఈ పరిశ్రమలో 117 మంది క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయించడం జరిగిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు పేర్కొన్నారు. వేతన ఒప్పందం సందర్భంగా గురువారం జరిగిన పరిశ్రమ గేట్ మీటింగ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాస్ సాలరీలోరూ.10,545/-, సిటీసిలో రూ.12,486/- నెల వేతనంలో ఒక్కో కార్మికుడికి కిర్భి పరిశ్రమ చరిత్రలోనే పెంపుదల సాధించామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక నెల గ్రాస్ శాలరీ పెంచమన్నారు. ఎడ్యుకేషన్ అలవెన్స్, సర్వీస్ అవార్డ్స్, నైట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అలవెన్స్, హార్డ్ షిఫ్ట్ అలవెన్స్లు పెంచామని తెలిపారు. కార్మికుల ఉద్యోగ భద్రత సంక్షేమం హక్కులను రక్షించడం సిఐటియు తోనే సాధ్యమని చెప్పారు. లేబర్ కోడ్లు ఇంప్లిమెంటేషన్ నేపథ్యంలో కార్మికుల పర్మినెంట్ అనేది లేనీ తరుణంలో 117 మంది కార్మికులను పర్మినెంట్ చేయడం అనేది ఒక చారిత్రాత్మకమన్నారు. ఈ చారిత్రాత్మక వేతన ఒప్పందము సందర్భంగా పరిశ్రమ కార్మికులు చుక్క రాములను అభినందించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అతిమేల మానిక్, గౌరవ అధ్యక్షులు కె.రాజయ్య, జనరల్ సెక్రటరీ వి.ఎస్ రాజు, పాశమైలారం గ్రామ పెద్దలు సుధాకర్ గౌడ్, బానూర్ సర్పంచ్ శాంతయ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago