Telangana

కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న సిఐటియు

-పాశమైలారం లోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల్లో

సిఐటియు యూనియన్ ఏర్పాటు

-బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల మాణిక్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కార్మికుల సంక్షేమం కోసం సిఐటియు నిరంతరము పాటుపడుతుందని బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. మండలంలోని ఐడిఏ పాశమైలారం పారిశ్రామిక వాడ లోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సిఐటియు అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గురువారం పటాన్ చెరు పట్టణం లోని శ్రామిక్ భవన్ లో జరిగిన బిస్లెరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ కార్మికుల సమావేశానికి ముఖ్యఅతిథిగా అతిమేల మాణిక్ హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్య యుతంగా ఐడిఏ పాశమైలారం ఫేస్ – 3 లో గల ” బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ” పరిశ్రమలో కార్మికులు అందరూ ఐక్యంగా సిఐటియు అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నారని, కార్మికులందరికీ సిఐటియు అభినందనలు తెలియజేస్తుందన్నారు.

కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం సిఐటియు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. యూనియన్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని రిజిస్ట్రేషన్ కాఫీ జతపర్చి యాజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించి త్వరలోనే యూనియన్ ఇంట్రడక్షన్ జాయింట్ మీటింగ్ ఇస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. యాజమాన్యం యూనియన్ కు సహకరించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

యూనియన్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని రిజిస్ట్రేషన్ కాఫీ జతచేస్తూ కార్మిక శాఖ అధికారులు డిప్యూటీ లేబర్ కమిషనర్, జాయింట్ లేబర్ కమిషనర్, సిఐ భానూర్, పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ కు లెటర్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం యూనియన్ కృషికి సహకరించాలని అన్నారు.ఈ సమావేశంలో సిఐటియు పటాన్ చెరు ఏరియా నాయకులు బి నాగేశ్వరరావు, ఐడిఏ పాశమైలారం క్లస్టర్ నాయకులు రాజు, బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ఎన్.శేఖర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, జాయింట్ సెక్రెటరీ అజయ్ ఠాకూర్, కోశాధికారి నవీన్ కమిటీ సభ్యులు రాము నాయక్, అమిత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేతలు

మనవార్తలు ప్రతినిధి  - శేరిలింగంపల్లి : టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్. జగదీశ్వర్ గౌడ్,…

10 hours ago

అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ స్నాతకోత్సవ్ 2025” గ్రాడ్యుయేషన్ వేడుక

మనవార్తలు ప్రతినిధి  - శేరిలింగంపల్లి : వాణిజ్యం మరియు నిర్వహణ విద్యలో ప్రముఖ పేరున్న అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్…

10 hours ago

విజయవంతంగా ముగిసిన ఇండస్ట్రీ కాంక్లేవ్

విద్యా సంస్థలు – పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించేలా అర్థవంతమైన చర్చలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్…

12 hours ago

ఆరోగ్యం, సామరస్యాలలో ఆహారం కీలకం

గీతంలో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం పలు ఆహ్లాదకర పోటీలలో పాల్గొన్న విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆరోగ్యం,…

1 week ago

బిసి రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలపడం చాల విడ్డురం_ మాజీ జెడ్పిటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన కుట్ర అని మాజీ…

2 weeks ago

నిరు పేదలకు వరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్‌చెరు శాసన…

2 weeks ago