మనవార్తలు ,బొల్లారం
మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. బొల్లారం మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల తో కలిసి వినతి పత్రం ఇచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఐ టి యు పోరాటాల ఫలితంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జనవరి 6,2022 నాడు జీవో నెంబర్ 4ను విడుదల చేశారని ప్రస్తుతం ఉన్న జీవితానికి 30 శాతం పెంచారని అని .పెరిగిన వేతనాలు జూన్ 2021 నుండి చెల్లించాలని జీవోలో పొందుపరిచారని అయినా ఇంతవరకు పెరిగిన వేతనాలను కార్మికులకు చెలించలేదని మండి పడ్డారు .పెరిగిన వేతనాలను కార్మికులకు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా 8 నెలలకు సంబంధించిన ఏరియాస్ ను ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…