మనవార్తలు,జిన్నారం
రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని, జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు . అనంతరం ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు స్ఫూర్తితో అనేక సంవత్సరాలు వాళ్ళ అనుభవాలను రాబోయే దశాబ్దాల ను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ నీ తనఅహంకార ధోరణి తో అవమానపరచడం బాధాకరమని తెలిపారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పేంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు ఎమ్మెల్యేలు ఎంపీల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదారం రాజు గౌడ్, మాజీ ఎంపిటిసి పుట్టి భాస్కర్, ఎస్సీ డిపార్ట్మెంట్ పటాన్చెరు కన్వీనర్ కొనింటి మహేష్, యనగండ్ల నరేందర్, పోచమ్మల స్వామి ,పల్నాటి భాస్కర్ ,కంది ఎల్లయ్య ,మాదారం వార్డు సభ్యులు కుమార్ భవాని ,అశోక్ ,పట్నం శీను ,సీతారాం రాజు సింగ్, సత్యనారయణ లక్ష్మన్, వెంకటేష్ .రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…
బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్కు…
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…