సూర్యుడి చుట్టూ వలయం...
-మంచు బిందువులపై సూర్యకిరణాలు పరావర్తనం చెందడమే కారణమన్న ఖగోళ నిపుణులు
-వీటిని 22-డిగ్రీ హలోస్ అంటారన్న బిర్లా ప్లానెటోరియం అధికారులు
హైదరాబాద్:
తెలంగాణలో పలుచోట్ల ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమయింది. సూర్యుడి చుట్టూ ఇంద్రధనుస్సు మాదిరిగా వలయం కనిపించింది. హైదరారాబాద్, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ సహా పలుచోట్ల ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీన్ని చూసి ప్రజలు అబ్బురపడ్డారు. తమ సెల్ ఫోన్లలో దృశ్యాన్ని బంధించారు.
దీనిపై ఖగోళశాస్త్ర నిపుణులు మాట్లాడుతూ, దట్టమైన మేఘాలు ఏర్పడినప్పుడు వాటిలో ఘనీభవించిన నీటి బిందువులు ఉంటాయని… వాటిపై సూర్యకిరణాలు పడినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. మంచు బిందువులపై పడిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఇంద్రధనుస్సు రంగుల్లో కనిపిస్తాయని తెలిపారు.
మరోవైపు, సూర్యుడు లేదా చంద్రుడి చుట్టూ ఇలాంటి వలయాకారాలు (వరదగుడి, వరదగూడు అని కూడా అంటారు) ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచికగా భావించవచ్చని చెప్పారు. ఇలాంటి వలయాలు ఏర్పడటం అశుభమంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను బిర్లా ప్లానెటోరియం అధికారులు ఖండించారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని 22-డిగ్రీ హలోస్ అంటారని చెప్పారు. ఈ వలయాలకు సుమారు 22 డిగ్రీల వ్యాసార్ధం ఉంటుందని అన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…