పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
యేసు క్రీస్తు బోధనలు ఆదర్శనీయం అని ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్కుల్ పరిధిలోని బ్యులా చర్చ్ లతో పాటు పలు చర్చిలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్బంగా క్రైస్తవ సోదరులకు కేక్ లను పంపిణీ చేశారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ మానవుడిగా ప్రజల మధ్యనే నడయాడి సమాజానికి శాంతి సందేశం అందించిన దయామయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు.క్రీస్తు చూపిన శాంతి మార్గం సర్వ మానవాళికి స్ఫూర్తి దాయకమని, ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ ప్రేమ, జాలి, దయా గుణాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆదర్శనీయం మని ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. అనంతరం బ్యులా చర్చ్ ఆధ్వర్యంలో కండరాల హీన సమస్యలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్థులకు దుప్పట్లు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రైస్తవ సోదరులు, ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…