పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
యేసు క్రీస్తు బోధనలు ఆదర్శనీయం అని ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్కుల్ పరిధిలోని బ్యులా చర్చ్ లతో పాటు పలు చర్చిలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్బంగా క్రైస్తవ సోదరులకు కేక్ లను పంపిణీ చేశారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ మానవుడిగా ప్రజల మధ్యనే నడయాడి సమాజానికి శాంతి సందేశం అందించిన దయామయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు.క్రీస్తు చూపిన శాంతి మార్గం సర్వ మానవాళికి స్ఫూర్తి దాయకమని, ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ ప్రేమ, జాలి, దయా గుణాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆదర్శనీయం మని ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. అనంతరం బ్యులా చర్చ్ ఆధ్వర్యంలో కండరాల హీన సమస్యలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్థులకు దుప్పట్లు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రైస్తవ సోదరులు, ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…