మనవార్తలు,రామచంద్రపురం
రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం లో బిజెపి రాష్ట్ర మరియు జిల్లా కమిటి ఆదేశానుసారం రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి పట్టణ బిజెపి పార్టీ కార్యాలయంలో జైభీందీక్షకు దిగారు. ఈ సందర్బంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి భారత రాజ్యాంగాన్ని మార్చాలని దళితులను మరియు డా. అంబేద్కర్ అవమానించే విధంగా మాట్లాడటం సరికాదు అని అన్నారు .
అదేవిధంగా 7సం ల కాలంలో దళితుణ్ని ముఖ్యమంత్రి చెస్తాను అని, మూడు ఎకరాల భూమి ఇస్తానని, దళితబందు అమలుచెస్తా అని అన్ని బూటకపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు. ఈ చేతకాని ముఖ్య మంత్రి రాజ్యాంగాన్ని మార్చాలనడం రాజ్యాంగం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు అంజిరెడ్డి, ఓబీసీ మోచ అధ్యక్షులు యాదగిరి, మల్లేష్, రవీందర్ గౌడ్,లక్ష్మణ్, పెంటారెడ్డి, రాంబాబు, రాజు, కృష్ణ రెడ్డి, రమేశ్ గుప్తా, లక్ష్మణ్ గౌడ్, కటికే శ్రీను, శ్రీనివాస రావు, మైనారిటీ నాయకులు షఫి,సల్మాన్, బాబ్జీ,ప్రసాద్ రావు,అమృత,అజాజ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…