మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో ప్రజలను కన్నబిడ్డల్లా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను పెద్ద కొడుకుగా ప్రతీ ఇంటిలో ఆశీర్వదిస్తున్నారని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పటాన్చెరు మండలం ఇస్నాపూర్ అనాధ వృద్ధాశ్రమంలో నిత్యవసర వస్తువులు, పండ్లు, 5000 రూపాయలు అందించారు .మానవసేవే మాధవసేవ అన్న నానుడిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అనాధలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా అనాధాశ్రమం లో వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు .వారందరూ సంతోషించి రాష్ట్ర ముఖ్యమంత్రిని పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధించారని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎంఎం యువసేన సభ్యులు అనిల్, మురళి, విష్ణువర్ధన్, నాగేందర్, శ్రీకాంత్, ప్రవీణ్, జగదీష్, బాలు, మోజేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…