మనవార్తలు ,పటాన్ చెరు:
భారతదేశంలో వినియోగదారుల ధరల సూచిక ద్రవ్యోల్బణంపై ప్రయోగాధార అధ్యయనం – సమయ శ్రేణి విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మాథమెడిక్స్ విభాగం పరిశోధక విద్యార్థి టి . వంశీకృష్ణను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ని గణితశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .
ఈ అధ్యయనం హార్బ్ ఘాతాంకాన్ని నిర్ణయించడానికి వివిధ పద్ధతులను ఉపయోగించిందని , వినియోగదారుల ధరల సూచిక – భారత ద్రవ్యోల్బణం దీర్ఘ – శ్రేణి ఆధారపడే స్వభావాన్ని నిర్ధారించినట్టు ఆయన తెలిపారు . మనదేశంలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణానికి అత్యుత్తమ సూచన నమూనాను నిర్ణయించడంపై కూడా దృష్టి సారించినట్టు తెలిపారు . ఘాతాంక సులువైన పద్ధతి , సరళ యాదృచ్చిక పద్ధతులు , కృ త్రిమ న్యూరల్ నెట్వర్క్ పద్ధతులతో మూల్యాంకనం చేసినట్టు పేర్కొన్నారు .
భారతదేశంలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణానికి ARFISMA నమూనా ఉత్తమమైనదిగి గుర్తించినట్టు తెలియజేశారు . వంశీకృష్ణ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , | హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…