మనవార్తలు , శేరిలింగంపల్లి:
దేశంలోఅత్యధిక జనాభా కలిగిన బిసిలను దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కేవలం ఓట్లు వేసే మిషన్ల గానే చూస్తున్నాయని. ఇప్పటిదాకా నమ్మి ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్లు ఎటువంటి సహాయం చేయడం లేదని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ తెలిపారు..అక్రమ సంపాదనకే పెద్ద పీట వేసుకుని ఉన్నారని ఈ రాజకీయ పార్టీలు దొంగల ముఠాలుగా ఏర్పడి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శించారు.. వీరికి ఓటు వేస్తే బీసీలు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు బాగు పడుతారా అని ప్రశ్నించారు.
బీసీలు తీవ్రంగా మోసగించబడుతున్నారని. న్యాయంగా బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు అగ్రకులాలు తన్నుకుపోతున్నాయని,. ఉద్యోగాలలో కూడా బీసీలను మోసం చేసి అగ్ర కులాలకు దొంగ మార్గంలో కట్టపెడుతున్నాయని, ప్రభుత్వంలో కీలక పోస్టులలో అధికారులు అగ్ర కులాల వారే ఉంటారని పేర్కొన్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు పోటీలో ఉంటే వారికి మాత్రమే ఓటు వేయండని, అందుకే బీసీలలో చైతన్యం వచ్చి యావత్ బీసి సమాజాన్ని జాగృతం చేయాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై.శివ ముదిరాజ్ స్పష్టం చేశారు. బిసి ఉద్యమ పోరాటంలో భాగంగా హాల్లో బిసి చలో ఢిల్లీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…