Districts

ఢిల్లీ రాజకీయాలు పక్కనపెట్టి ముందు ధాన్యం కొనండి

ప్రభుత్వం తీరుపై షాద్ నగర్ బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం

మనవార్తలు ,షాద్ నగర్

షాద్ నగర్ మార్కెట్ యార్డును పరిశీలించిన బీజేపీ బృందంవర్షా కాలం పంట వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనే దిక్కులేకుండా పోయిందని, ధాన్యం కొనమంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నారని ముందు టిఆర్ఎస్ రాజకీయాలు పక్కనపెట్టి ముందు రైతుల నుంచి ధాన్యం కొనాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

మంగళవారం షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డును బిజెపి బృందం సభ్యుల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం వచ్చి నెల రోజులు గడుస్తున్నాయని మార్కెట్ కు ధాన్యం వస్తుంటే కొనలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు వడ్లు కనుగొలు చేయకుండా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కెసిఆర్ ఢిల్లీ వెళ్లారని తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలు ఉంటె వాటిని పక్కన పెట్టాలని ముందు రైతు వద్ద ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.

60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ప్రభుత్వం మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం సమయాన్ని వృధా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నడిరోడ్డులో పెట్టి టిఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తగలక మానదని శాపనార్థాలు పెట్టారు. గత ఆరు నెలలుగా రాష్ట్రాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికలను ఆసరా చేసుకొని రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. హుజరాబాద్ తీర్పు వచ్చాక కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని దెప్పి పొడిచారు.ఇప్పుడు ప్రభుత్వం ప్రతి గింజను కొని తీరాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 6500 కొనుగోలు కేంద్రాలు అవసరం ఉంటే కనీసం పాతిక కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్రంలో లేవని విమర్శించారు. దిగుమతి అయిన ధాన్యంతో రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ధాన్యం సేకరించ కపోతే ఆందోళన తీవ్రం కాక తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలుఅందే బాబయ్య, సీనియర్ నాయకుడు భూపాలచారి, వెంకటేశ్వర్ రెడ్డి,వెంకటేష్ గుప్తా, మోటే శ్రీనివాస్, మధుసుధన్ గౌడ్, వంశీకృష్ణ, మల్చాలం మురళి, చెట్ల వెంకటేష్, ఎంకనోళ్ల వెంకటేష్, ప్యాట అశోక్ ,శేగు శ్రీనివాస్, లాస్కర్ నాయక్, వినోద్ కుమార్, నర్సింలు యాదవ్, డోడల వెంకటేష్, ఋషికేష్, శ్యామ్ సుందర్ రెడ్డి, మధు సుధన్ రెడ్డి, పిట్టల సురేష్,శివ కృష్ణ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago