మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
విద్యార్థుల ఆట, పాటలతో మాదాపూర్లోని మెరీడియన్ స్కూల్లో ఆదివారం జరిగిన మెరివాగంజా–2025 కార్నివాల్ సందడిగా జరిగింది. ఈ కార్నివాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారని పాఠశాల ప్రిన్సిపాల్ కరణం భవాని తెలిపారు. మెరివాగాంజ కార్నివాల్–2025 లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఓ జాతర వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. సవారీలు, ఇంటరాక్టివ్ బోర్డు ఆటలు, లక్కీ డ్రా విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి చదువుల్లో రాణించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాసంస్థల ఫౌండర్ బుట్టా రేణుక తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…