Telangana

దేశ భక్తిని ఘనంగా చాటేందుకే గణతంత్ర దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

74వ జాతీయ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని.పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామ పంచాయితీలో గణతంత్ర వేడుకల్లో  పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ గ్రామంలో ఎస్సీ కాలనీ,ముదిరాజ్ కాలనీ,ప్రాథమిక పాఠశాల ,అంగన్వాడి కేంద్రం, రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు గణతంత్ర స్పూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారుజనవరి 26న, భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని చాలా వైభవంగా, ఉత్సాహంతో జరుపుకుంటున్నామన్నారు. 1950లో జనవరి 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందిందని భారతదేశం 1947లో వలస పాలన నుండి స్వాతంత్య్రం పొందినప్పటికీ, జనవరి 26, 1950 వరకు భారత రాజ్యాంగం అమలులోకి రాలేదని గుర్తు చేశారు. భారతదేశం తన స్వంత రాజ్యాంగం కలిగిన ఒక సార్వభౌమ రాజ్యంగా అవతరించిందన్నారు. అప్పటి నుంచి ఒక ప్రజాపరిపాలన వ్యవస్థ కలిగిన గణతంత్ర దేశంగా భారతదేశం తనని తాను ప్రకటించుకుందని గుర్తు చేశారు .ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం అని దేశ ఐక్యతను చాటుతూ ప్రతిఒక్కరూ గణతంత్ర వేడుకలను జరపుకోవాలని నీలం మధు ముదిరాజ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈఓ కవిత, ఎంపీటీసీలు మాధవి రెడ్డి,మంజుల, ఉప సర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి,వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ , వెంకటేశ్ , భుజంగం,శ్రీను ,మురళీ,రాజ్ కుమార్, వెంకటేశ్, యాదగిరి ,నర్సింగ్,ఆంజనేయులు, ఆశ వర్కర్లు, ఉపాధ్యాయులు,విద్యార్థులు,గ్రామ పెద్దలు, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago