నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
నూతన చైర్మన్ గా కుశంగుల ప్రమీల , వైస్ చైర్మన్ గా పట్లోళ్ల హరీష్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి నేతృత్వంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ కుశంగుల ప్రమీల చైర్మన్ గా, బిఆర్ఎస్ పార్టీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల హరీష్ రెడ్డి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పరిపాలన అందించాలని ఆయన కోరారు. మున్సిపాల్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…