Telangana

కోర్ ఇంజనీరింగ్ కు మంచి భవిష్యత్తు: శ్రీభరత్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

సంప్రదాయ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలపై కృత్రిమ మేథ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సిరోస్పేస్ వంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు ప్రాధాన్యం పెరుగుతోందని గీతం అధ్యక్షుడు ఎం. శ్రీభరత్ అన్నారు. హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘టన్నెలింగ్’పై బుధవారం నిర్వహించిన ఒక రోజు కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీభరత్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కృత్రిమ మేథ వల్ల కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలపై క్రమంగా ప్రభావం పడుతోందన్నారు. అదే సమయంలో మనదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏడున్నర లక్షల కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోందని చెప్పారు. వర్ధమాన ఇంజనీర్లకు ఇదో మంచి అవకాశమని, వారు ఎంచుకున్న ఇంజనీరింగ్ బ్రాంచ్లలో మంచి పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. టన్నెలింగ్, భూగర్భంలో నిర్మాణాలు దేపట్టడంపై లోతెన జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిశ్రమకు చెందిన సలుపురు ప్రముఖులు పాల్గొన్నారు.జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) భవిష్యత్తు ప్రణాళికలు, ప్రస్తుతం నవరత్న హోదా మహారత్నగా మారబోతున్న విషయాన్ని ఆ సంస్థ జనరల్ మేనేజర్ (పరిశోధన, అభివృద్ధి) ఎస్.కె.చౌరిసియా చెప్పారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, 2040 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ఆశాభావం వెలిబుచ్చారు.నవంబర్ నెలలో ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా టన్నెల్ ప్రమాదం, అందులో చిక్కుకున్న వారిని కాపాడడానికి చేసిన ప్రయత్నాలు, ఉపయోగించిన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాల గురించి ఆత్మీయ అతిథిగా పాల్గొన్న స్కయ్డ్రోన్ ఇన్ఫ్రా అండ్ మెన్దింగ్ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణాధికారి సిరియాక్ జోసెఫ్ వివరించారు. ఆ సనుయంలో ఎదురైన సవాళ్లు, సమష్టిగా తాము వాటిని అధిగమించిన తీరును తెలిపారు. రోజురోజుకు మారుతున్న సాంకేతికతపై పట్టు సాధించి, తనును తాము ముందజంలో ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.సోరంగాలు, భూగర్భ ప్రదేశాలకు సంబంధించిన జియోటెక్నికల్ సరిశోధనలపై విలువెట్టి అంతరృష్టులను హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సలహాదారు ప్రొఫెసర్ డి.సి.రెడ్డి అందించారు, సిల్క్యారా టన్నెల్ చిక్కుకున్న వారిని రక్షించే కార్యక్రమంలో సిరియాక్ జోసెఫ్ పాత్రను గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఇతర అతిథులను కూడా పరిచయం చేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అఖిలేష్, చేపూరి స్వాగతోపన్యాసం చేయగా, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సి.శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు.

 

admin

Recent Posts

ఆర్కిటెక్చర్ కోర్సు, కెరీర్ అవకాశాలపై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో,…

22 hours ago

గణితంలో ఆదుర్తి శ్రీవల్లికి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…

2 days ago

ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంగోలి, కైట్ ఫెస్టివల్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

4 days ago

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…

6 days ago

యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…

6 days ago

విశ్వగురు స్వామి వివేకానంద

దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…

6 days ago